‘గబ్బర్ సింగ్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు రమేష్ ఇటీవల తీవ్రమైన బ్రెయిన్ స్ట్రోక్కు గురై, హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, నటుడు పవన్ కళ్యాణ్ తక్షణ సాయంగా ₹5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.
అంతేకాకుండా, రమేష్ పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యే వరకు అయ్యే వైద్య ఖర్చులన్నీ తానే చూసుకుంటానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చినట్లు ‘గబ్బర్ సింగ్’ బ్యాచ్ సభ్యులు మీడియాకు వెల్లడించారు.
మెగా కుటుంబం & సినీ ప్రముఖుల సాయం
రమేష్ వైద్య చికిత్స కోసం మెగా కుటుంబంతో పాటు ఇతర సినీ ప్రముఖులు ముందే స్పందించి అండగా నిలిచారు:
- మెగాస్టార్ చిరంజీవి: ₹3 లక్షల ఆర్థిక సాయం
- పవన్ కళ్యాణ్: ₹5 లక్షల ఆర్థిక సాయం (పూర్తి వైద్య బాధ్యతలు)
- నాగబాబు: ₹2 లక్షల ఆర్థిక సాయం
- దర్శకుడు హరీష్ శంకర్ సహా పలువురు వైద్యులతో మాట్లాడుతూ నిరంతరం పరిస్థితు పర్యవేక్షిస్తున్నారు.
స్పందించిన ‘గబ్బర్ సింగ్’ టీమ్ & రమేష్ భార్య
గబ్బర్ సింగ్ సాయి:
“పవన్ కళ్యాణ్ సార్ మాకు దేవుడిలాంటి వారు. సహాయం కావాల్సిన ఏ సందర్భంలోనైనా ఆయన ముందుంటారు. రమేష్ ఆరోగ్యం గురించి నిరంతరం ఆరా తీస్తూ 5 లక్షల సాయం అందించారు. రమేష్ డిశ్చార్జ్ అయ్యే వరకు అన్ని చూసుకుంటామని ధైర్యం చెప్పారు.”
గబ్బర్ సింగ్ రిమ్స్:
“పరిస్థితి క్లిష్టంగా ఉండి, ఆస్పత్రి నుంచి ఎక్కడికైనా షిఫ్ట్ చేయాలా అనే టెన్షన్లో ఉన్నాం. పవన్ సార్కు విషయం తెలియగానే స్పందించి, ఆస్పత్రి మార్చాల్సిన అవసరం లేదని, పూర్తి ట్రీట్మెంట్ బాధ్యత తనదేనని భరోసా ఇచ్చారు. ఈ మేలు జన్మలో మర్చిపోలేం.”
రమేష్ భార్య:
“పవన్ కళ్యాణ్ సార్ మా కుటుంబాన్ని ఆదుకుని, నా భర్తను రక్షిస్తానని ఇచ్చిన భరోసాకి ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఆయనకు నా పాదాభివందనాలు.”
