ముంబై విమానాశ్రయంలో గంజాయి స్మగ్లింగ్ చేస్తూ కేరళకు చెందిన ఓ మోడల్ దొరికింది. దాదాపు దాని విలువ 11.82 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. 2025లో మిస్సెస్ కేరళ పోటీదారైన 28 ఏళ్ల హర్ష సన్నీ బ్యాంకాక్ నుంచి ముంబై విమానాశ్రయంలో దిగింది.

ఈ క్రమంలో ఆ మోడల్ పై అనుమానం వచ్చిన అధికారులు ట్రాలీ బ్యాగ్ ను తనిఖీ చేయగా ఆకుపచ్చ రంగులో ఉన్న 12 ప్యాకెట్స్ బయటపడ్డాయి. నార్కో పరీక్షల్లో దానిని గంజాయిగా గుర్తించారు.

ఆ ప్యాకెట్ల బరువు 11 కేజీలు ఉండగా దాదాపు వాటి విలువ 11.82 కోట్ల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. పట్టుబడిన గంజాయి ఎక్కడికి తీసుకెళ్తుందనే దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *