తెలంగాణ ప్రజల నిత్యావసరాల పంపిణీ (PDS) వ్యవస్థలో ఒక కీలకమైన మరియు చారిత్రాత్మక మార్పు చోటుచేసుకోబోతోంది. రాష్ట్రంలోని అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేయడం కోసం అత్యంత ఆధునికమైన ‘స్మార్ట్ రేషన్ కార్డులు’ సర్వం సిద్ధమయ్యాయి. యాదాద్రి భువనగిరి, జనగామతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలకు ఈ కొత్త కార్డులు ఇప్పటికే చేరుకున్నాయి.
గత ఇరవై ఏళ్లుగా పాత పద్ధతిలోనే సాగుతున్న రేషన్ కార్డుల రూపురేఖలను మార్చేస్తూ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వీటిని సరికొత్త డిజైన్తో, అత్యంత ఆధునికంగా రూపొందించింది.
పంపిణీకి సర్వం సిద్ధం:
రేషన్ షాపుల వారీగా ఉన్న లబ్ధిదారుల సంఖ్యకు అనుగుణంగా ఈ స్మార్ట్ కార్డులను అధికారులు ఇప్పటికే వేరు చేసి ప్యాక్ చేశారు. లబ్ధిదారుల చేతుల్లోకి ఈ కార్డులను వీలైనంత త్వరగా అందించేందుకు పౌరసరఫరాల శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.ఈ స్మార్ట్ రేషన్ కార్డుల రాకతో రేషన్ పంపిణీలో పారదర్శకత పెరగడమే కాకుండా, లబ్ధిదారులకు పాత చిరిగిన కాగితపు కార్డుల బాధలు తప్పనున్నాయి.
