Thalliki Vandanam: 'తల్లికి వందనం' డబ్బులు పడలేదా? గ్రామ సచివాలయాల్లో గ్రీవెన్స్ నమోదుకు అవకాశం!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘తల్లికి వందనం’ పథకం నిధులను కూటమి ప్రభుత్వం నేడు విడుదల చేయనుంది. 2026-27 విద్యా సంవత్సరానికి గాను మొత్తం రూ. 10,120.78 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 67.47 లక్షల మంది విద్యార్థులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూరనుంది.

పథకానికి సంబంధించిన ముఖ్య విషయాలు:

  • మొత్తం సాయం: ప్రతి విద్యార్థికి రూ. 15,000 వర్తిస్తుంది.
  • జమ అయ్యే విధానం:
    • లబ్ధిదారులైన తల్లుల/సంరక్షకుల ఖాతాల్లో రూ. 13,000 నేరుగా జమ అవుతాయి.
    • మిగిలిన రూ. 2,000 విద్యార్థి చదువుతున్న పాఠశాల మెయింటెనెన్స్ అకౌంట్‌లో జమ చేస్తారు.
  • రెండు విడతల్లో పంపిణీ:
    • తొలి విడత: ఇప్పటికే పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేటి నుంచి 3 రోజుల పాటు నిధులు జమ అవుతాయి.
    • రెండో విడత: ఈ ఏడాది కొత్తగా చేరిన విద్యార్థులకు తదుపరి విడతలో నిధులు విడుదల చేస్తారు.

మీ పేమెంట్ స్టేటస్ ఆన్‌లైన్‌లో ఎలా చెక్ చేసుకోవాలి?

మీ ఖాతాలో డబ్బులు పడ్డాయో లేదో తెలుసుకోవడానికి ఈ కింది సులభమైన స్టెప్స్ ఫాలో అవ్వండి:

  1. ముందుగా అధికారిక వెబ్‌సైట్ bm.sgsw.ap.gov.in ను ఓపెన్ చేయండి.
  2. హోమ్‌పేజీలో ఉన్న ‘Status Check’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
  3. Scheme Type లో ‘Thalliki Vandanam’ అని సెలెక్ట్ చేసుకోండి.
  4. లబ్ధిదారు నిబంధనల ప్రకారం ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
  5. ఆధార్‌కి లింక్ అయిన మొబైల్ నంబర్‌కు వచ్చే OTP, అలాగే స్క్రీన్‌పై ఉన్న Captcha కోడ్‌ను నమోదు చేయండి.
  6. సబ్‌మిట్ చేయగానే మీ Payment Status స్క్రీన్‌పై కనిపిస్తుంది.

గమనిక: స్క్రీన్‌పై Success / Payment Released అని వస్తే నగదు జమ అయినట్లే. ఒకవేళ Pending లేదా Inactive NPCI అని వస్తే.. మీ బ్యాంక్ ఖాతాకు ఆధార్/NPCI మ్యాపింగ్ పూర్తి కాలేదని అర్థం. వెంటనే బ్యాంక్‌ను సంప్రదించి ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *